27-06-2025 01:14:29 AM
ఘట్ కేసర్, జూన్ 26 : అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అనురాగ్ విశ్వవిద్యాలయం యువతలో మాదక ద్రవ్య దుర్వినియోగం వల్ల కలిగే హానికర ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు గురువారం ర్యాలీ నిర్వహించింది. ఈకార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ యూనిట్2 ప్రోగ్రామ్ ఆఫీసర్ పి. చిన్ని శ్రీనివాస్ రావు మార్గదర్శకత్వంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేశ్ మరియు ఇంజినీరింగ్ పాఠశాల డీన్ డాక్టర్ వై. విజయ్ కుమార్ అనుమతి మరియు మద్దతుతో నిర్వహించబడింది.
అనురాగ్ విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్లకు చెందిన మొత్తం 61 మంది విద్యార్థులు ఈర్యాలీలో చురుకుగా పాల్గొన్నారు. ఈర్యాలీని పోచారం పోలీస్ స్టేషన్, తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో మరియు వికలాంగులు మరియు వృద్ధుల సం క్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సహకారంతో నిర్వహించబడింది. విద్యార్థులు డ్రగ్స్ రహిత స మాజాన్ని ప్రోత్సహిస్తూ బ్యానర్లు చేతబట్టి, పోస్టర్లు ప్రదర్శిస్తూ, యువతలో మాదక ద్రవ్యాల వాడకాన్ని నిరుత్సాహపరిచే నినాదాలు చేశారు. ఈ ర్యాలీ హైదరాబాద్లోని జలవిహార్ వద్ద ప్రా రంభమై ప్రధాన ప్రజారహదారులపై సాగింది. ఇది ప్రజల దృష్టిని ఆకర్షించి, మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వల్ల కలిగే తీవ్ర పరిణామాలపై అవగాహన కల్పించింది.