20-06-2025 04:28:09 PM
వెంకటాపురం నూగూరు (విజయక్రాంతి): సీజనల్ వెదర్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్వాక్రా మహిళలకు కాఫీ ప్రత్యక్ష ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం జరిగింది. మండల పరిధిలోని మంగవాయి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సూర్య(Dr. Surya) పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... మీ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. దోమలు రాకుండా దోమతెరలు వేసుకోవాలని, ఇంటి చుట్టుపక్కల ఏమైనా నీరు నిల్వ ఉంటే శుభ్రంగా చేసుకోవాలని తెలియజేశారు.
వర్షా కాలంలో వర్షాలు ఎక్కువగా రావడం వల్ల విష జ్వరాలు చాలా మందికి వస్తాయని, కాచి చల్లార్చిన నీళ్లను తాగాలని, పరిశుభ్రమైన బట్టలు వేసుకోవాలని, ఇంటి చుట్టూ మురుగునీరు చేరకుండా శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వెంకటాపురం మండల కోఆర్డినేటర్ జి హనుమంత్ యానిమేటర్స్ పద్మ, ఇందిరా, ఉషా ప్రశాంత్, నరేష్, గ్రామస్తులు 70 మంది పాల్గొన్నారు.