20-06-2025 04:33:02 PM
జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్...
ములుగు (విజయక్రాంతి): మారుమూల ప్రాంతమైన ములుగు జిల్లా(Mulugu District)లో రేషన్ కార్డుదారులకు ఒకేసారి 3 నెలల రేషన్ సన్న బియ్యం పంపిణీ వంద శాతం పూర్తి చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్ జి(District Additional Collector CH Mahenderji) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఒకేసారి 3 నెలల రేషన్ సన్న బియ్యం పంపిణీ(జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ సన్న బియ్యం) ప్రజా పంపిణీ వ్యవస్థ చౌక ధరల దుకాణాల ద్వారా ఈ నెల ఒకటవ తేదీన ప్రారంభించడం జరిగింది.
జిల్లాలోని 222 రేషన్ షాపుల ద్వారా తేది. 19.6.2025 నాటికి కేవలం 19 రోజుల్లో 5,218 మెట్రిక్ టన్నులు సన్న బియ్యంను లబ్ధిదారులకు పంపిణీ చేసి రాష్ట్రంలో ములుగు జిల్లా ముందంజలో ఉందని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో రేషన్ కార్డు దారులకు ఇబ్బందుల కలుగకుండా రేషన్ సన్న బియ్యం లబ్దిదారులకు 100 శాతం పంపిణీ చేయడం జరిగినదని ఆ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.