17 April, 2026 | 11:08 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

వైభవంగా అయ్యప్ప పడిపూజ

24-11-2025 12:00 AM

-హాజరైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

మణికొండ,  నవంబర్ 23 (విజయక్రాంతి) : మణికొండ శివాలయంలో ఆది వారం అయ్యప్ప మహా పడిపూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే తోలుకంటి ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప మాలధారులు, గురుస్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం శరణు ఘోషతో మార్మోగింది.

ఈ పూజా కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్, మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి, నార్సింగి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీరాములు, గురుస్వామి రాజేంద్ర గౌడ్, నార్సింగి ఏఎంసీ డైరెక్టర్ ఏర్పుల కుమార్, నాయకులు శ్రవణ్ కుమార్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.