20-06-2025 08:22:23 PM
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు...
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రుశ్విక(7) సంవత్సరాల చిన్నారి తలసేమియా వ్యాధితో బాధపడు తుండడంతో ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం హైదరాబాద్ లో దొరకకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు(IVF Seva Dal State Chairman Red Cross District Coordinator Dr. Balu)ను సంప్రదించడంతో వారికి కావలసిన బి పాజిటివ్ రక్తాన్ని తలసేమియా సికిల్ సెల్ సొసైటీ ద్వారా సకాలంలో అందజేయడం జరిగిందని అన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ... ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 250 మంది చిన్నారులు భయంకరమైన తల సేమియా వ్యాధితో బాధపడుతున్నారని వారి ప్రాణాలను కాపాడాలంటే వారికి జీవితాంతం 15 రోజులకు ఒక యూనిట్ రక్తాన్ని అందజేయాలని లేకపోతే వారి ప్రాణాలను కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు, అందుకోసమే రాష్ట్రవ్యాప్తంగా మెగా రక్తదాన శిబిరాల ఏర్పాటు చేస్తూ వారి ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.