04-06-2025 01:27:40 AM
ఐపీఎల్-2025 విజేత ఆర్సీబీ
ఫైనల్లో 6 పరుగులతో విజయం
పంజాబ్కు తప్పని నిరాశ
‘ఆపరేషన్ సిందూర్’విజయంపై బీసీసీఐ కృతజ్ఞతలు
ఐపీఎల్-2025 విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ 18 ఏళ్లుగా టైటిల్ జపనామం చేస్తూ వచ్చిన ఆర్సీబీ సరిగ్గా ఐపీఎల్ 18వ సీజన్లోనే ఆ ముచ్చటను తీర్చుకోవడం విశేషం. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్పై 6 పరుగుల తేడాతో బెంగళూరు ఘన విజయాన్ని అందుకొని తొలి సారి ఐపీఎల్ టైటిల్ను ముద్దాడింది.
ఇప్పటివరకు మూడుసార్లు ఫైనల్లో ప్రత్యర్థికి తల వంచిన బెంగళూరు నాలుగోసారి మాత్రం ఆ అవకాశం ఇవ్వకుండా కప్ను ఒడిసిపట్టింది. మరోవైపు పంజాబ్ కింగ్స్కు మాత్రం మరోసారి నిరాశే ఎదురైంది. 11 ఏళ్ల కిత్రం తొలి ఐపీఎల్ ఫైనల్ ఆడిన పంజాబ్ మళ్లీ ఇన్నేళ్లకు రెండో ఫైనల్ ఆడినప్పటికీ రన్నరప్కే పరిమితమైంది. క్వాలిఫయర్-1లో ఇదే బెంగళూరు చేతిలో పరాజయం పాలైన పంజాబ్ కింగ్స్ ఫైనల్లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేసింది.
అహ్మదాబాద్, జూన్ 3: ఐపీఎల్-2025 విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ 18 ఏళ్లుగా టైటిల్ జపనామం చేస్తూ వచ్చిన ఆర్సీబీ సరిగ్గా ఐపీఎల్ 18వ సీజన్లోనే ఆ ముచ్చటను తీర్చుకోవడం విశేషం. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైన ల్లో పంజాబ్ కింగ్స్పై 6 పరుగుల తేడాతో బెంగళూరు ఘన విజయాన్ని అందుకొని తొలిసారి ఐపీఎల్ టైటిల్ను ముద్దాడింది.
ఇప్పటివరకు మూడుసార్లు ఫైనల్లో ప్రత్యర్థికి తలవంచిన బెంగళూరు నాలుగోసారి మా త్రం ఆ అవకాశం ఇవ్వకుండా కప్ను ఒడిసిపట్టింది. మరోవైపు పంజాబ్ కింగ్స్కు మా త్రం మరోసారి నిరాశే ఎదురైంది. 11 ఏళ్ల కిత్రం తొలి ఐపీఎల్ ఫైనల్ ఆడిన పంజాబ్ మళ్లీ ఇన్నేళ్లకు రెండో ఫైనల్ ఆడినప్పటికీ రన్నరప్కే పరిమితమైంది. క్వాలిఫయర్ లో ఇదే బెంగళూరు చేతిలో పరాజయం పాలైన పంజాబ్ కింగ్స్ ఫైనల్లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేసింది.
తలా కొన్ని పరుగులు..
మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసిం ది. బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (43) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. పటీదార్ (26), లివింగ్స్టోన్ (25) పర్వాలేదనిపించారు. పంజాబ్ బౌల ర్లలో అర్ష్దీప్, కైల్ జేమీసన్ చెరో 3 వికెట్లతో మెరిశారు. అనంతరం చేధనలో పంజాబ్ కింగ్స్ మరోసారి తడబడింది.
20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో జోస్ ఇంగ్లిస్ (61 నాటౌట్) అజేయంగా నిలిచినప్పటికీ పంజాబ్ను గెలిపించలేకపోయాడు. ప్రభ్సిమ్రన్ (26), ప్రియాన్ష్ ఆర్య (24) పర్వాలే దనిపించారు. బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్యా 2 వికెట్లు తీయగా.. భువనేశ్వర్, షెపర్డ్, హాజిల్వుడ్ తలా ఒక వికెట్ తీశారు.
ఘనంగా ముగింపు వేడుకలు
అంతకుముందు ఐపీఎల్ 18వ సీజన్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ముగింపు వేడుకల్లో ‘ఆపరేషన్ సిందూర్ విజయం నేపథ్యంలో భారత సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలుపుతూ బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.
ఇందులో భాగంగా త్రివిధ దళాలకు (ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్) చెందిన జెండాలతో హెలికాప్టర్లతో స్టేడియం పైనుంచి వెళ్లిన సమయంలో ‘భారత్ మాతా కీ జై’ అని మ్యాచ్కు హాజరైన అభిమానులు నినాదాలు చేయడంతో స్టేడియం హోరెత్తిపోయింది. అనంతరం పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి బీసీసీఐ నివాళి అర్పించింది.
ప్రముఖ గా యకుడు శంకర్ మహదేవన్, ఆయన కుమారులు శివం, సిద్ధార్థ్ మహదేవ్ బృందం దేశభక్తి గీతాలతో అభిమానులను అలరించారు. కాగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేం దుకు ఐసీసీ చైర్మన్ జై షా, బీసీసీఐ అధ్యక్షు డు రోజర్ బిన్నీ, బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ సహా ప్రముఖులు హాజరయ్యారు.