22 May, 2026 | 9:51 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

బైరాన్‌పల్లిని పర్యాటక కేంద్రంగా చేయాలి

18-03-2026 05:53 PM

జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి

చేర్యాల: తెలంగాణ సాయుధ పోరాటంలో సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలం బైరన్‌పల్లి గ్రామ ప్రజలు ప్రదర్శించిన ధైర్యసాహసాలను గౌరవిస్తూ వారి బలిదానాలను స్మరించేందుకు ఆ గ్రామానికి వీర బైరాన్‌పల్లిగా నామ కరణం చేయాలని జనగామ ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభూత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించి పర్యాటక, సంస్కృతి, పురావస్తు శాఖా మంత్రి జూపల్లి కృష్ణా రావుకు బుధవారం జనగామ ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు.

బైరన్‌పల్లి, కూటిగల్, లింగాపూర్ గ్రామాల చారిత్రక ప్రాముఖ్యత గల ప్రదేశాలుగా అధికారికంగా ప్రకటించి ఈ ప్రాంతంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి, బైరన్‌పల్లిలోని ప్రసిద్ధ బురుజు సహా ఇతర చారిత్రక కట్టడాలను పరిరక్షించాలని సూచించారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా పాఠ్య పుస్తకాలలో చేర్చాలని ఈ ప్రాంతంలోని అమరవీరుల కుటుంబాలకు, ప్రాణాలతో బయటపడిన వారికి తగిన ఆర్థిక సహాయం అందించాలని పేర్కొన్నారు.