07-06-2025 06:49:26 PM
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో శనివారం బక్రీద్(Eid al-Adha) వేడుకలు ఘనంగా నిర్వహించారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని మణుగూరులోని ముస్లిం సోదరులు ఉదయమే ఈద్గా వెళ్లి బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా మణుగూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి వంగ రవీందర్ రెడ్డి నేతృత్వంలో బందోబస్తు నిర్వహించారు.