07-06-2025 06:47:21 PM
ఏరియా టిబిజికెయస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి..
మణుగూరు (విజయక్రాంతి): సమయ పాలన, విధుల పట్ల అంకిత భావం ప్రదర్శిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారం చూపడంలో సివిల్ డిపార్ట్మెంట్ అధికారులు స్పూర్తి దాయకమైన అంశం అని ఏరియా టిబి జికె యస్ వైస్ ప్రెసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు(Vice President Nagelli Venkateswarlu) అన్నారు. రైల్వేస్టేషన్ కు వెళ్ళే రహదారి వెంబడి చెట్టు కొమ్మలు విపరీతంగా పెరిగి వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నాయని అడ్డంకిగా మారిన చెట్టు కొమ్మలను తొలగించాలని సివిల్ డిపార్ట్మెంట్ అధికారులను శనివారం ఆయన కోరారు.
రైల్వే స్టేషన్ సమీపంలోని ఉన్న పద్మగూడెం గ్రామానికి గత కొన్ని రోజులుగా తాగునీరు సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. పద్మగూడెం కు తాగునీరు సరఫరా చేసే వాటర్ ట్యాంక్ లు పైప్ ల వెంబడి విపరీతమైన తేనెటీగల తెట్లు ఉన్నాయనీ దానివల్ల వాల్ ఆపరేటర్ లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటిని తొలగించాలని కోరారు. రైల్వే స్టేషన్ కు వెళ్ళే రహదారి వెంబడి స్ట్రీట్ లైట్లు పూర్తిగా దెబ్బతినడం వల్ల రాత్రి సమయాల్లో రైల్వే స్టేషన్ రహదారి వెంబడి రాకపోకలు సాగించే వారంత ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
సమస్యలు తెలిపిన వెంటనే తాత్సారం చేయకుండా కార్మిక, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే స్పందించి ఆయా సమస్యల పరిష్కారం కోసం సివిల్ డిపార్ట్మెంట్ అధికార యంత్రాంగం కృషి చేయడం సంతోషరమైన అంశం అని ఆయన తెలిపారు. సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి ప్రదర్శిస్తూ కార్మిక వర్గానికి మేలు చేస్తూ నిబద్ధత కూడిన నాణ్యమైన సేవలు అందిస్తున్న సివిల్ డిపార్ట్ మెంట్ విభాగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.. పీవీ కాలనీ సంత ఎదురుగా ప్రధాన రహదారి వెంబడి ఉన్న గుంట ను పూడ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న వర్ష కాల దృష్ట్యా అంతర్గత రోడ్లు నిర్మాణ పనులు జాప్యం జరుగకుండా వేగవంతం చేసి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు.