07-06-2025 06:51:47 PM
పటాన్ చెరు: కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బీజేపీ జిన్నారం మండల ప్రధాన కార్యదర్శి ఎంకిరిగారి వెంకటేష్ ను ఎమ్మెల్సీ అంజిరెడ్డి(MLC Anji Reddy) శనివారం పరామర్శించారు. బీజేపీ జిల్లా, మండల నాయకులతో కలిసి దాదిగూడెం గ్రామంలోని వెంకటేష్ ఇంటికి వెళ్లిన అంజిరెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం వైద్య ఖర్చుల కోసం రూ.20 వేలు వెంకటేష్ కు అందజేశారు. ఆపదలో ఉన్న బీజేపీ కార్యకర్తలకు తన సహకారం ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్సీ వెంట బీజేపీ జిల్లా నాయకుడు ప్రతాప్ రెడ్డి, మండల అధ్యక్షుడు జగన్ రెడ్డి, దోమడుగు రమేష్, పల్నాటి శ్రీనివాస్, అశోక్, కృష్ణ ఉన్నారు.