07-06-2025 10:42:27 PM
మందమర్రి (విజయక్రాంతి): త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్(Eid al-Adha) పండుగ వేడుకలు పట్టణం, మండలంలో ముస్లిం సోదరులు శనివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు. పట్టణంలోని అస్ర మజీద్ లో బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు మాట్లాడుతూ... బక్రీద్ పండుగ ముస్లీంలకు ఎంతో ప్రత్యేకమైందని త్యాగానికి, సేవకి ప్రతీకగా ముస్లింలు జరుపుకునే పండుగ పవిత్రమైన పండుగల్లో ఒకటని పేర్కొన్నారు.
రంజాన్ పండుగ తర్వాత వచ్చే ఇస్లామిక్ క్యాలెండర్ లో ముఖ్యమైన నెలల్లో ఈ నెల ఒకటని తెలిపారు. బక్రీద్ త్యాగ స్ఫూర్తి, అత్యున్నత భక్తికి ప్రతీక అని, ఇస్లాంలో బక్రీద్ పండగకు ప్రత్యేక స్థానం ఉందని, పేదలకు సహాయం చేసే స్ఫూర్తిని బక్రీద్ పండుగ సూచిస్తుందని తెలిపారు. భక్తి, త్యాగాలకు ప్రతీకగా ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకుంటారని, తమకు కలిగిన దాంట్లో నుంచి ఇతరులకు పంచి పెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని బక్రీద్ పండుగ కలిగిస్తుందన్నారు. శాంతి, సహనం, దయ, కరుణ, ప్రేమ, ఐకమత్యం, మానవత్వానికి బక్రీద్ పండుగ ప్రతీక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని అస్ర మజీద్ కమిటీ సభ్యులు, ముస్లింలు పాల్గొన్నారు.