10-01-2026 12:11:35 AM
మేడ్చల్ అర్బన్ జనవరి 9 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మేడ్చల్ మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గౌడవెల్లి వాస్తవ్యులు బాల్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాల్ రెడ్డి మాట్లా డుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా అందరు పనిచేయాలని సీఎం సూచించినట్లు తెలిపారు.