20 March, 2026 | 9:11 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

పోరాటయోధుల త్యాగ ఫలితంతోనే స్వేచ్ఛ

17-09-2024 02:19 PM

శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ 

ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఎందరో పోరాటయోధుల త్యాగ ఫలితంతోనే నేడు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ పేర్కొన్నారు. మంగళవారం ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. ఆనాటి ఉజ్వల ఉద్యమ సందర్భం తెలంగాణ కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిపోయిందన్నారు. అద్భుత ఘట్టాలు జ్ఞాపకాల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయని తెలిపారు.

చిరస్మరణీయులైన ఆనాటి వీరయోధులందరినీ పేరుపేరునా స్మరించుకోవాల్సిన కర్తవ్యం మన అందరిపై ఉందని సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విట్టల్ ,కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, ఎస్పీ డి వి శ్రీనివాస్, డీఎఫ్ఓ నీరజ్ కుమార్, ఆర్డీవో లోకేశ్వరరావు, డి.ఎస్.పి కరుణాకర్, ఆయా శాఖల జిల్లా అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.