20 March, 2026 | 6:09 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు

20-03-2026 02:54 PM

ముంబై: ముంబై ప్రెస్ క్లబ్(Mumbai Press Club) ప్రాంగణంలో గ్యాస్ బాంబులు అమర్చామని, అవి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు పేలిపోతాయని పేర్కొంటూ ఒక బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. సమాచారం అందుకున్న భద్రతా సంస్థలు ఆ భవనంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి. అయితే అనుమానాస్పదంగా ఏమీ లభించలేదని పోలీసులు తెలిపారు. 

నీరజా అజ్మల్ ఖాన్‌గా తనను తాను పరిచయం చేసుకున్న ఆ ఈమెయిల్ పంపిన వ్యక్తి, ఆ సందేశంలో రాజకీయపరమైన వ్యాఖ్యలు కూడా చేశారని ఒక పోలీసులు పేర్కొన్నారు. అధికారి తెలిపిన వివరాల ప్రకారం, బాంబు బెదిరింపు ఈమెయిల్ గురించి సమాచారం అందిన వెంటనే, పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు దక్షిణ ముంబైలోని ప్రెస్ క్లబ్ భవనంలో గాలింపు చర్యలను ప్రారంభించాయి.