25-06-2025 11:38:31 PM
కార్వాన్: పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పై వెళ్తున్న ఓ స్కార్పియోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే వాహనం కాలిపోయింది. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్(Gudimalkapur Police Station) పరిధిలోని పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 110 సమీపంలో చోటుచేసుకుంది. కేసు వివరాలను ఇన్స్పెక్టర్ బైరి రాజు తెలిపారు. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన జాహీద్ హుస్సేన్ తన స్కార్పియో వాహనంలో ఎక్స్ప్రెస్ వే పైనుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో పిల్లర్ నెంబర్ 110 సమీపంలో వాహనంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి భారీ ఎత్తున మంటలు చెల్లరేగాయి. ప్రమాదాన్ని గమనించి అప్రమత్తమైన ఆయన వెంటనే వాహనం దిగాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ముసుండగానే వాహనం కాలిపోయింది. ఫైర్ ఇంజన్ ను ఘటన స్థలానికి రప్పించి మంటలను ఆర్పి వేశారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని పక్కకు తొలగించడంతో ఫ్లై ఓవర్ పై వాహనాల రాకపోకలు కొనసాగాయి.