సిపిఎం సానుభూతిపరుడు చెరుకుపల్లి వీరస్వామి మృతి
సిపిఎం పార్టీకి తీరనిలోటు
నివాళులర్పించిన సిపిఎం
పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్
కూసుమంచి, (విజయక్రాంతి): సిపిఎం సానుభూతిపరుడు చెరుకుపల్లి వీరస్వామి(90) మృతి సిపిఎం పార్టీకి తీరనిలోటని సిపిఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్ తెలిపారు. . మండలంలోని మల్లేపల్లి గ్రామంలో శుక్రవారం సిపిఎం సానుభూతిపరుడు చెరుకుపల్లి వీరస్వామి మృతి చెందిన విషయం తెలుసుకొన్న సిపిఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్ శనివారం మల్లెపల్లి గ్రామానికి చేరుకొని వీరస్వామి మృతదేహానికి ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిపిఎం పార్టీకి ఈ ప్రాంతంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లెల సన్మానరావు, మండల కార్యదర్శి తోటకూర రాజశేఖర్, గ్రామ శాఖ కార్యదర్శి చీర్ల రాధాకృష్ణ, శాఖ సభ్యులు, పార్టీ సానుభూతిపరులు పాల్గొని నివాళులర్పించారు






