calender_icon.png 16 June, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకులు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలి..

20-05-2025 08:14:33 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య..

హనుమకొండ (విజయక్రాంతి): వివిధ బ్యాంకులు జిల్లాకు సంబంధించిన నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య(District Collector P. Pravinya) అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలోని వివిధ బ్యాంకుల అధికారులు, వివిధ శాఖల అధికారులతో జిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లక్ష్యం రూ. 7413 కోట్లు కాగా, ఇందులో రూ. 6214 కోట్లు బ్యాంకుల వారీగా వితరణ జరగగా ఇప్పటివరకు చేరుకున్న ఆర్థిక లక్ష్యాలు, వ్యవసాయ, వ్యవసాయేతర, పరిశ్రమలు, ఆర్ సెటి, పీఎంఈజీపీ, ఆర్థిక అక్షరాస్యత, డీఆర్డీఏ, మెప్మా మహిళా స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ, బ్యాంకుల వారీగా అందించిన రుణాలు, ఆర్థిక చేరిక లక్ష్యాల ప్రణాళిక, తదితర అంశాలపై బ్యాంకర్లతో సమీక్ష సమావేశం అనంతరం జిల్లా సంప్రదింపుల కమిటీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ... దామెర మండలానికి సంబంధించి బ్యాంకును ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు.

వార్షిక ఋణ ప్రణాళిక ఆధారంగా బ్యాంకులు నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపికకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు పురోభివృద్ధి సాధించడానికి బ్యాంకు లింకేజీ రుణాలను అందించాలన్నారు. జిల్లా ఇన్చార్జి ఆదనపు కలెక్టర్ మేన శ్రీను మాట్లాడుతూ... మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు లింకేజీ రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎం.శ్రీనివాస్, నాభార్డ్ ఏజిఎం చైతన్య రవికుమార్, ఆర్.బి.ఐ. తానియా, జిడబ్ల్యూఎంసి డిప్యూటీ కమిషనర్ రాజేశ్వర్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ  బాలరాజు, మైనారిటీ వెల్ఫేర్ అధికారి మురళీధర్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, ఇతర అధికారులతో పాటు జిల్లాలోని వివిధ బ్యాంకులకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.