15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఘనంగా బసవేశ్వర జయంతి

30-04-2025 04:57 PM

బైంసా (విజయక్రాంతి): భైంసా పట్టణంలో విశ్వగురు బసవేశ్వర్ మహారాజ్ జయంతి(Basaveshwar Maharaj Jayanti) వేడుకలను బుధవారం వీరశైవ లింగాయత్ బైంసా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని కట్టా హోటల్ వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో కమిటీ సభ్యులు బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వీరశైవ లింగాయత్ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మారుతి నాగభూషణం పాండురంగ మాట్లాడుతూ... 11వ శతాబ్దంలోని విశ్వగురు బసవేశ్వర్ సమాజంలోని రుగ్మతలను తొలగించేందుకు ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగిందని తెలిపారు. స్త్రీలపై జరుగుతున్న వివక్షత బాల్యవివాల నిషేధం వితంతులకు పునర్వివాహాలు సమాజంలో మహిళలకు గౌరవం నీతివంతమైన పాలన ఆలయాల్లో అన్ని వర్గాల వారికి ప్రవేశం అనే అంశాలతో లింగాయత్ సమాజాన్ని స్థాపించడం జరిగిందని దాన్ని నేటికీ ఆచరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో లింగాయత్ సమాజ్ సభ్యులు పాల్గొన్నారు.