25-09-2025 01:00:08 AM
మహదేవపూర్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో జాతీయ సేవా దినోత్సవం రోజును పురస్కరించుకొని బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ నరసయ్య మాట్లాడుతూ భారతదేశంలోనే పూలను పూజించే పండుగ మన తెలంగాణ సంస్కృతిలో ఉన్నదని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరని, మన సంస్కృతిని సంప్రదాయాలను కొనసాగిస్తూ ఆడపిల్లలు బతుకమ్మ సంబరాలు ఘనంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
జాతీయ సేవా పథకం రోజున పురస్కరించుకొని మా కోసం కాదు మీకోసం అనే నినాదంతో ఈ సేవా భావంతో కార్యక్రమాలు చేయాల్సిందిగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత మానవ సేవా దృక్పథం అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అబ్దుల్ గని, ప్రసాద్, సమ్మయ్య, సదశివ్, సదానందం, సంధ్య, శ్రీనివాస్, మహేష్, సనత్ కుమార్, కర్ణ, ప్రకాష్, మహేందర్, శ్వేతా, రమాదేవి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.