10-12-2025 12:00:00 AM
ముకరంపుర, డిసెంబరు 9 (విజయ క్రాంతి): బీసీల 42 శాతం రిజర్వేషన్లు, హ క్కులు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రి త్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధానమైన డిమాండ్ తో ఈనెల 10,11,12న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాకు ఉమ్మడి జిల్లా నుంచి బీసీ సంఘం నాయకులు మం గళవారం తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు న ర్సింగోజు శ్రీనివాస్, నాయకులు శ్రీమన్నారాయణ, మనోజ్ గౌడ్, గుంటి స్వరూప, హసీనా, తదితరులుపాల్గొన్నారు.