calender_icon.png 30 May, 2025 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

30-05-2025 12:31:48 AM

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట.మే 29(విజయక్రాంతి): సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జి ల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. ఈ సారి ముందస్తుగానే ముసురు వర్షాలు కురుస్తుండడంతో  వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. 

గురువారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో  వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం లో జి ల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. దోమల ద్వారా వచ్చే వ్యాధుల  నివారణ కు  వైద్యశాఖ అధికారులు, వైద్య సిబ్బంది ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. 

సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా  లాంటి  వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు.  సీజనల్ వ్యాధుల నివారణ కు పంచాయతీరాజ్, వాటర్ సప్లై, మున్సిపల్, ఎ డ్యుకేషన్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళిక కు సిద్ధం  చేసుకోవాలని క లెక్టర్ ఆదేశించారు.

గతేడాది జిల్లాలో నమోదైన డెంగ్యూ కేసుల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటిలలో గతేడాది ఎన్ని కేసులు నమోదు అయ్యాయి ? ఎలాంటి ని యంత్రణ చర్యలు తీసుకున్నారని కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.  అలాగే  శిథిలావస్థకు చేరిన పెద్ద పెద్ద భవనాలను కూల్చివేసేందుకు యజమానులకు నోటీసులు జారీ చేయాలన్నారు.

లేనిపక్షంలో మున్సిపల్ అధికారులే వా టిని కూల్చి వేయించాలన్నారు. దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై   చర్చించారు. అం తకుముందు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయ చంద్రమోహన్ సిజనల్ వ్యాధుల గురించి, దోమల వల్ల వచ్చే వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పవర్ పా యింట్ ప్రజెంటెన్ ద్వారా వివరించారు.

సమావేశంలో డీఈవో గోవిందరాజులు, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శైలజ, డిపిఓ భిక్ష పతి, డి ఎల్ పి ఓ సుధాకర్, నారాయణపేట, మక్తల్, మద్దూర్, మున్సిపల్ కమిషనర్లు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

మ్యాన్యువల్ స్కావెంజర్ రహిత జిల్లాగా పేట

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ 

నారాయణపేట.మే 29(విజయక్రాంతి) : జిల్లాను మాన్యువల్ స్కావెంజర్ రహిత జిల్లాగా ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుప్రీం కోర్ట్ ఉత్తర్వుల ప్రకారం మాన్యువల్ స్కావెంజర్స్ జిల్లా స్ధాయి సర్వే కమిటీ  జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ ఈనెల 1న నిర్వహించడం జరిగింది.

ఈ కమిటీ వీధి విధానాలకు సంబంధించి గ్రామ, మున్సిపాలిటీ స్థాయిలలో, రైల్వే మొదలగు సంస్థలలో సర్వే నిర్వహించడం జరిగింది. పూర్తి స్థాయి నివేధిక ఈనెల 14 వరకు తయారుచేయబడింది. అయితే  అ నివేధికలో నారాయణపేట్ జిల్లా నందు మాన్యువల్ స్కావెంజింగ్ పని ఎక్కడ కూడా చేయటం లేదని పేర్కొనడం జరిగింధి.

అయితే  ప్రభుత్వ ఆధేశాల మేరకు 14 నుండి 28 వరకు సెల్ఫ్ డిక్లరేషన్ కు సమయం ఇవ్వడము అయినది. అయితే ఎవరు కూడా మేము మాన్యువల్ స్కావెంజింగ్ ఇంకా చేస్తున్నాము అని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ది శాఖకు ఫిర్యాదు చేయలేదు. కావున నారాయణపేట్ జిల్లాను మాన్యువల్ స్కావెంజింగ్ రహిత జిల్లాగా ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.