24-02-2026 12:25:21 AM
పంజాగుట్ట, ఫిబ్రవరి 23(విజయక్రాంతి): నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం, అకాడమీ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో బీకాన్ 2026 పేరుతో భారీ జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ను నిర్వహించనుంది. సంస్థ ఆర్గనైజింగ్ చైర్పర్సన్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ మాట్లాడుతూ మార్చి 13 నుంచి 15 వరకు బిల్డింగ్ ఎక్సలెన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, క్లినికల్ ఆపరేషన్స్ అండ్ నెట్వర్కింగ్ అనే థీమ్తో ఈ సదస్సు జరగనుంది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఆహ్వానించామని తెలిపారు.
అనంతరం 14, 15 తేదీలలో బంజారా హిల్స్లోని కుమ్రం భీము ఆదివాసి భవన్లో ప్రధాన సదస్సు జరుగుతుందన్నారు.దేశవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు, పాలసీ మేకర్లు మరియు పరిశోధకులు ఈ వేదికపై హెల్త్కేర్ రంగంలోని సవాళ్లు, ఆధునిక పోకడలపై చర్చించనున్నారని వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ పేర్లను www.nimsbea con.com వ్బుసైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఆబ్ స్ట్రాక్ట్ సమర్పణ గడువు ముగిసినప్పటికీ ఎంపికైన వారు తమ పేపర్లను మార్చి 5 లోగా అందజేయాల్సి ఉం టుందన్నారు. 8904311484, 8688541111 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.