23 May, 2026 | 7:47 PM

ఖానాపూర్ బొడ్డోని కుంట సుందరీకరణకు శ్రీకారం

23-05-2026 07:14 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలోని శాంతినగర్ లో గల బొడ్డోని కుంట సుందరీకరణ పనులకు ఆదివారం శ్రీకారం చుట్టనున్నారని ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ మేరకు వారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆదివారం జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా బొడ్ ని కుంట సుందరీకరణకు ప్రారంభం చేస్తున్నామని దీనికి సుమారు ఒక కోటి 21 లక్షల వ్యయంతో పనులు ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు. దీంతోపాటు దస్తురాబాద్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్కు రూ 20 లక్షల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టనున్నారని వారు తెలిపారు.