09-01-2025 12:00:00 AM
చైనాలో పుట్టిన హ్యూమన్ మెటాన్యుమో వైరస్ (హెచ్ఎంపీవీ) ప్రపంచన్నంతా వణికిస్తున్నది. గత ఐదేళ్ల క్రితం చైనాలోనే పుట్టిన కరోనా వైరస్ (మహమ్మారి) ఎంతోమంది ప్రాణాలను బలి గొంది. అది తగ్గినా దాని దుష్ఫ్రలితాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరాలు రావడం దగ్గు, పడిసం, ఉబ్బసం, గుండెపోటు వంటి అనేక వ్యాధులతో ప్రజలు సతమతమవుతున్నారు.
ఈ కొత్త వైరస్ ప్రపంచమంతా వ్యాపిస్తుందనే వార్తలు బెంబేలెత్తిస్తున్నాయి. మన దేశంలో ముఖ్యంగా బెంగళూరు, అహ్మదాబాద్లో పిల్లలలో వ్యాధి లక్షణాలు కన్పించడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.
హెచ్ఎంపీవీ లక్షణాలు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై ఎక్కువగా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తున్నది. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ హెచ్ఎంపీవీ హెల్త్ బులెటిన్ను విడుదల చేస్తూ, ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ఈ వ్యాధి వచ్చిన తర్వాత నయం చేసుకోవడం కంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ముందు జాగ్రత్తలు తప్పనిసరి
ప్రజలు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ముఖాలకు మాస్క్లు ధరించాలి. గుంపులు గుంపులుగా చేరకుండా దూరం గా ఉండాలి. జ్వరం, దగ్గు, ఉబ్బసం, ఊపిరితిత్తులు, గుండెపోటు లాంటి వ్యాధులు వచ్చినప్పుడు నిపుణులైన వైద్యుల సలహా మేరకు మందులు, సూదులు వాడాలి. సొంత వైద్యం పనికిరాదు. అయితే, ఇదేమంత ప్రాణాంతక వ్యాధి కాదని, అయి నా ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు.
ప్రజలు కరోనా వైరస్వల్ల ఏర్పడిన భయంకరమైన రోజులను గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో పాఠశాలలు, విద్యా సంస్థలు మూసి వేయడం, ఇంట్లోనే ఉం డాలని చెప్పడం, వివాహాలు, శుభ కార్యా లు వాయిదా వేసుకోవడం, ఎవరైనా ఎంతటి దగ్గరి బంధువులు చనిపోయినా అంత్యక్రియలకు వెళ్ళడానికి భయపడటం, తోటి మనిషిని చూస్తేనే భయపడిన ఆనా టి రోజులు ఆందోళన కలిగిస్తున్నాయి.
కేం ద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని రక్షించే బాధ్యతను తీసుకొని ప్రజలలో కొత్త వైరస్ వ్యాప్తి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించాలి. పాఠశాలలు, విద్యాసంస్థలలో ఉచితంగా మాస్కులను పంపిణీ చేయాలి. అన్ని ప్రాంతాలు, పరిసరాలను శుభ్రంగా ఉండేటట్లు చూడాలి. ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు, సూదుల కొరత రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.
జనసంచారం ఎక్కువగా ఉండే ప్రార్థన స్థలాల దగ్గర, మార్కెట్లలో, పాఠశాలలు, విద్యాసంస్థల్లో హెచ్ఎంపీవీ వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ, వి స్తృతంగా అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయాలి.
అప్రమత్తంగా ఉండేటట్లు చూడా లి. జ్వరం, దగ్గు, పడిసం, ఉబ్బసం వ్యాధులు సోకిన వారు బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం అన్ని రకాల అందరికీ శ్రేయ స్కరం. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుండటం వల్ల హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు కన్పించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందనే నమ్మకంతో ప్రజలు ఉన్నారు.
డా. ఎస్. విజయభాస్కర్