09-01-2025 12:00:00 AM
శ్రీరాముడు యువకుడిగా ఎదిగిన త ర్వాత రాక్షసులతో యుద్ధం చేయవలసి వచ్చింది. కాని, శ్రీ కృష్ణుడి పుట్టుకే శ త్రుస్థావరమైన జైల్లో జరిగింది. ఎంతోకాలం గడిచాక శ్రీకృష్ణ ఆవిర్భావ వేళ ఉన్న పరిస్థితులు అప్పుడే ఉన్నట్టు భావించి గోపికలు ఆందోళన పడుతున్నారు. గోపికలు ఆదేశిస్తే సింహాసనం దాకా నడిచి వచ్చి అధిరోహించి న భక్త పరాధీనుడు శ్రీకృష్ణుడు. తనకు మం గళం పాడారు గోపికలు నిన్నటి పాశురంలో.
తాను సర్వశక్తిమంతుడినని తెలిసినా, నాకు ఏ దృష్టి దోషమూ రావద్దని కోరుకుంటున్నారు. నా శక్తికి, బలానికి, ఆయుధాలకు లోపం రాకూడదని మంగళం పాడుతున్నారు. ఎంత ప్రేమ? ఎంత ఆదరణ? అనుకుంటూ వీరిని ఆదుకోవలసిందే, అడిగింది ఇవ్వవలసిందే అని భావిస్తున్నాడట.
ఒక తల్లికి(ఒరుత్తి) మగనాయ్ (పుత్రుడిగా) జనించి (పిఱందు) పుట్టి న రాత్రే మరొక తల్లికి(ఒరుత్తి) కొడుకుగా(మగనాయ్) రహస్యంగా పెరుగుతున్న కాలంలో (ఒళిత్తువళర) ఒక రాక్షసుడు(త్తాన్) సహించని వాడై(తరిక్కిలానాగి) కీడు తలపెట్టి (తీంగు నినైంద) కంసుని(కంజన్) దురాలోచనను (కరుత్తు) భగ్నం చేసి(పిరైప్పిత్తు) ఆతని కడుపులో (వయిట్రిల్) నిప్పు నిలిచిన(నెరు ప్పు నిన్ఱ) సర్వాధికుడా(నెడుమాలే) నిన్ను(ఉన్నై) కావలసిన వాటిని అడగడానికి వచ్చి నాము (అరుత్తిత్తువందోమ్) మాకోరికను తీ ర్చేట్లయితే (పఱై తరుదియాగిల్) శ్రీమహాలక్ష్మి కూడా కోరదగిన నీ ఐశ్వర్యాన్ని (తిరుత్త క్క శెల్వముమ్) నీ శౌర్యసౌశీల్య లక్షణాలను (సేవగముమ్) మేము పాడి, స్తుతించి(యా మ్ పాడి) నిన్ను ఎడబాసిన దుఃఖము తొలగిపోగా(వరుత్తముమ్ తీర్ న్దు) సంతోషిస్తాము(మగిఝిన్దు).
గజేంద్రమోక్షంలో ఒక భక్తుడిని కాపాడడానికి వచ్చినట్టు రావడం కాదు కృష్ణావతా రం అంటే, ఒక తల్లి కడుపులో పుట్టి తన అవతారాన్ని ప్రారంభించి మరో తల్లి ఇంట పెరి గాడు శ్రీకృష్ణుడు. శ్రీరాముడు యువకుడిగా ఎదిగిన తర్వాత రాక్షసులతో యుద్ధం చేయవలసి వచ్చింది. కాని, శ్రీ కృష్ణుడి పుట్టుకే శ త్రు స్థావరమైన జైల్లో జరిగింది. పుట్టిన వెం టనే మౌనంగా జైలునుంచి తరలిపోయి రహస్యంగా మరొక తల్లి దగ్గర పెరగాల్సి వచ్చింది.
ఏడో రోజునుంచే రాక్షసులతో పోరాటం త ప్పలేదు. అందుకే, తల్లి పేరు చెప్పకుండా, ఎ క్కడ పుట్టాడో ఎవరో ఎవరి దగ్గర పెరుగుతున్నాడో, అతనికి ఎవరివల్ల భయం ఉందో ఆ తని పేరు దాచి మాట్లాడుకుంటున్నారు భ యం భయంగా గోపికలు. కాలం గడిచిపోయినా శ్రీకృష్ణ ఆవిర్భావ సమయంలో ఉన్న పరిస్థితులు అప్పుడే ఉన్నట్టు భావించి ఆందోళన పడుతున్నారు. ఇదీ గోపికల భక్తి ప్రేమా తిశయం.
భగవంతుడికి జన్మనిచ్చిన సంతోషం కన్న ఆయన్ను కంసుడేం చేస్తాడోనన్నభయంతో పసికందును అర్ధరాత్రి తల్లి తీసుకుపొమ్మని ఇచ్చేసింది. కన్నతండ్రి తరలించవలసి వచ్చింది. పోనీ నంద గ్రామం లోనైనా ప్రశాంతంగా పెరిగాడా అంటే అదీ లేదు.
ఆ సమయంలో పుట్టిన ప్రతి శిశువును సంహరించాలని కంసుడి ఆదేశం. దాన్ని పా టించాలని ఇంకా ఎక్కడైనా పసికందు కనిపిస్తాడా అని చూస్తూ పాలిస్తాననే నెపంతో బ యలుదేరిన పూతన, బండిలో దూరిన శకటాసురుడి వంటి రాక్షసులు ఎందరు ఊళ్లో తిరుగుతున్నారు.
ఆ కంసుని గుండెల్లో నిప్పు కూర్చున్నాడు శ్రీకృష్ణుడు. అంతటి ఉద్రిక్త ప రిస్థితులలో సైతం శత్రువులకు భీతి గొల్పుతూనే భక్తులకు, ఆశ్రితులకు ఆనందం కలిగిం చే లీలలు చేసిన శ్రీకృష్ణుడికి భక్తులపట్ల తీవ్ర వ్యామోహం ఉందట. ఈ కష్టాలన్నీ స్వీకరించిందే భక్తులకోసం. “మా కోసం జన్మలెత్తా ల్సిన పనిలేదు. ఎక్కడికో రావలసిన అవస రం లేదు. మేమే నీకోసం వచ్చాం. మాకు ఏ ప్రయోజనాలేవీ లేవు. మీ దర్శనం చాలు. మాకు నీవే కావాలి” అన్నారు గోపికలు.