09-09-2025 12:45:35 AM
బెల్లంపల్లి అర్బన్, సెప్టెంబర్ 8 : హైదరాబాద్ బిర్లా సైన్స్ మ్యూజియం. భాస్కర అడిటోరియంలో మహా కవు ల జయంతోత్సవంలో బెల్లంపల్లికి చెం దిన కవి, రచయిత గోడిసెల శ్రీహరి ప్రశంసలందుకున్నారు. ఈ సందర్భం గా జాతీయ కవి సమ్మేళనం మాతృధార కవితల సంకలనం పుస్తకాలను ప్రముఖ కవి, రచయిత నంది సిద్ధారెడ్డి ఆవిష్కరించారు. ఇందులోప్రధానంగా అమ్మ మీద రాసిన కవులకు పురస్కారాలు అందచేశారు.
ఈ సందర్భంగా మాతృధార పుస్తకాన్ని కేంద్రాసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కవి, రచయిత ఉమ మహేశ్వర్ రావు, రిటైర్డ్ ఐజి ఇక్బల్, కవి రచయిత పొట్లూరి హరికృష్ణ చేతుల మీదుగా సత్కరించారు.