11-06-2025 08:54:02 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పోగొట్టుకున్న సెల్ఫోన్లను ఎంతో చాకచక్యంగా స్వాధీనం చేసుకొని తిరిగి వారికి అప్పగించారు. సెల్ ఫోన్లను పోగొట్టుకొని వాటి వివరాలను సిఐఆర్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసారు. వారి ఫిర్యాదు అందుకున్న వన్ టౌన్ సిఐ దేవయ్య(One Town CI Devaiah), సిఈఐఆర్ ఆపరేటర్ ఇవి రామకృష్ణ, సిబ్బందిని అప్రమత్తం చేసి సెల్ ఫోన్లను గుర్తించి బుధవారం బాధితులకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్(ACP Ravi Kumar) చేతుల మీదుగా అప్పగించారు.
ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతు ఎవరైనా తమ సెల్ ఫోన్ పోగొట్టుకున్నా, దొంగిలించబడినా వెంటనే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆ వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్ లో నమోదు అవుతాయని తెలిపారు. సెల్ ఫోన్ వినియోగదారులు తాము సెల్ ఫోన్ కొనుగోలు చేసిన సమయంలో తప్పనిసరిగా సంబంధిత బిల్లులు, ఐఎంఈఐ నెంబర్ లు భద్రపరచాలని తెలిపారు. నేటి సమాజంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నందున సెల్ ఫోన్ ల పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని బెల్లంపల్లి ఏసిపి సూచించారు. తమ సెల్ ఫోన్ పోయిందని తెలియజేసిన వెంటనే స్పందించి తమ ఫోన్ ట్రాకింగ్ చేసి అప్పగించిన బెల్లంపల్లి ఏసిపి 1 టౌన్ సిఐ కి ,సిబ్బంది కి బాదితులు కృతజ్ఞతలు తెలిపారు.