30-05-2025 12:11:36 AM
కల్లూరు,మే29 (విజయ క్రాంతి) సత్తుపల్లి నియోజకవర్గం లో 3,500 మంజురు కాగా మం డలాలు వారీగా కేటాయించిగా కల్లూరు మండలం లో 756 కేటాయించిగా 756 మంది అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందరమ్మ ఇళ్ల పట్టాలు అందచేయడం జరుగుతుంది.
మం డలం లో ప్రస్తుతం ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులకు గురువారం మండలం పరిషత్ కా ర్యలయంలో ఇంటి నమూనా, ప్రామాణికాలు,నిర్దేశికాలను ఎంపీడీఓ చెంద్రశేఖర్ ఆధ్వర్యంలో వివరించండం జరిగింది.తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పేదల సొంతింటి కలను నెరవేరుస్తోంది.
లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. మధ్యవర్తులు, దళారులు మాటలు నమ్మి మోసపకండి ఎవరికి ఒక్క రూపాయి ఇచ్చే పనిలేదు మొత్తం లబ్ధిదారులు ఖాతాలో జమ చేయబడుతుందని తెలిపారు.
ఎ ఈ మాట్లాడుతూ..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు తెలంగాణ సర్కారు పకడ్బందీగా చర్యలు చేపడుతోంది. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త ప్పనిసరిగా 400 చదరపు అడుగుల విస్తీర్ణం తగ్గకుండా, 600చదరపు అడుగులు మించ కుండా ఇల్లు నిర్మాణం చేపడితేనే బిల్లులు చెల్లిస్తారని ,ఇంటి నిర్మాణం చేపట్టే ముందు ఎ ఈ పంచాయితీ కార్యదర్శి కి సమాచారం ఇవ్వాలని,
వారు చూపిన కొలతలు ప్రకారం నిర్మాణం చేపడితేనే బిల్లు లు మంజూరు అవుతాయన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. లబ్ధిదారులకు ఎంపీడీఓ కార్యలయం ప్రాంగణంలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా ఇంటిని ఎంపీడీవో చంద్రశేఖర్,ఎంపీ ఓ రంజిత్, ఏ ఈ ల సమక్షంలో లబ్ధిదారులు తిలకించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులు పాల్గొన్నారు.