30-05-2025 12:13:10 AM
అధికారులకు విన్నవించుకున్న ముగ్గు వెంకటాపురం గ్రామస్తులు
కల్లూరు మే 29 ( విజయ క్రాంతి)మండల పరిధిలోని ముగ్గు వెంకటాపురం గ్రామపంచాయతీ, ఆవాస గ్రామం చైతన్య నగర్ నందు 1,2 అంగన్వాడి సెంటర్ లో టీచర్లుగా పనిచేస్తున్న అత్తునూరి కృష్ణవేణి, కొత్తపల్లి విజయ కుమారి ల పదవి కాలం ముగియడంతో ఆ రెండు సెంటర్లలో అంగన్వాడి టీచర్ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయని నోటిఫికేషన్ ద్వారా ఆ పోస్టులు భర్తీ చేయాలని గ్రామస్తులు అధికారులను కోరారు.
ఉన్నతాధికారులు నోటిఫికేషన్ జారీ చేస్తే నిరుద్యోగులలో ఎవరికో ఒకరికి ఉపాధి అవకాశం కలుగుతుందన్నారు. గ్రామంలో దాదాపు 30- 40 మంది అర్హత కలిగిన మహిళలు ఆశతో ఎదురుచూస్తున్నారన్నా రు. వీరిలో కొంతమంది మహిళలు భర్తలను కోల్పోయి ఒంటరి జీవనం గడుపుతున్నారని, మరికొందరు భర్తల ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఆర్థిక స్థితిగతులతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ముగ్గు వెంకటాపురం సెంటర్ నందు ప్రస్తుతం ఆయా, చైతన్య నగర్ సెంటర్ లో ఆయాలు పనిచేస్తున్నారు. గ్రామంలో విశ్వసనీయ సమాచార మేరకు ఆయా గా పనిచేస్తున్న వారికే టీచర్ పోస్టులు ఇస్తున్నారనే రూమర్ గ్రామంలో విద్యావంతులైన మహిళలలో భయాందోళ చెందుతున్నారు. దీంతో అప్రమత్తమైన మహిళలు స్థానిక ఐసిడిఎస్ కార్యాలయంలో, ఖమ్మం కలెక్టర్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో నోటిఫికేషన్ విడుదల చేసి మాకు న్యాయం చేయండని విన్న వించుకున్నట్లు తెలిపారు.
ఐసిడిఎస్ నియమ నిబంధనల ప్రకారం ఎవరైతే అర్హులో వారికే అంగనవాడి టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నట్టు తెలిపారు.ఈ విషయంపై సిడిపిఓ నిర్మల జ్యోతి నీ వివరణ కోరగా ముగ్గు వెంకటాపురం గ్రామ పంచాయతీలో రెండు అంగనవాడి సెంటర్లు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని తమంతట తాము ఏమి చేయబోమని దీనికి చైర్మన్ జిల్లా కలెక్టర్ కొనసాగుతారని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నోటిఫికేషన్ ద్వారా ఖాళీలు భర్తీ చేయడం జరుగుతుందన్నారు.