30-05-2025 12:08:48 AM
పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
భద్రాద్రి కొత్తగూడెం, మే 29, (విజయక్రాంతి) పాల్వంచ మండలం పరిధిలోని కిన్నె రసాని లో ఆదివాసి శిక్షణా తరగతుల సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పం చాయతీరాజ్,గ్రామీణ నీటి సరఫరా శాఖ,స్త్రీ శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ను మండల కాంగ్రె స్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించా రు.
గురువారం కిన్నెరసానిలో ఆదివాసి అవగాహన కార్యక్రమము అనంతరం రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు తో పాటు కాంగ్రెస్ నాయకు లు ఆమెను శాలువా, బొకేలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, మాజీ జడ్పిటిసి సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, జిల్లా లేబర్ సెల్ చైర్మన్ సాధం రామకృష్ణ, మండల పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్, తదితరులు పాల్గొన్నారు.