27-07-2024 12:51:49 PM
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నీతి ఆయోగ్ సమావేశం నుండి వాకౌట్ చేశారు. అన్యాయం, వివక్షకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆమె మాట్లాడుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా తన మైక్రోఫోన్ను ఆఫ్ చేశారని, తన ప్రసంగాన్ని పూర్తి చేయకుండా అడ్డుకున్నారని బెనర్జీ ఆరోపించారు. అసోం, గోవా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు 10-12 నిమిషాలు మాట్లాడగా, చంద్రబాబు నాయుడుకు 20 నిమిషాల సమయం ఇచ్చారని ఆమె ఆరోపించారు. ఇది బెంగాల్ను మాత్రమే కాకుండా అన్ని ప్రాంతీయ పార్టీలను అవమానించడమేనని మమతా బెనర్జీ మండిపడ్డారు. నీతి ఆయోగ్ రద్దు చేసి ప్లానింగ్ కమిషన్ తిరిగి తేవాలని డిమాండ్ చేశారు. కేంద్రం వివక్షా పూరితంగా వ్యవహరిస్తోందన్న మమతా బెనర్జీ కేంద్ర బడ్జెట్ రాజకీయంగా ఉందని ఆరోపించారు.