12-06-2025 11:45:46 PM
4 పుష్పక్ బస్సులు నడపనున్నట్లు డీఎం వెంకటేశం వెల్లడి..
శేరిలింగంపల్లి: మియాపూర్-2 డిపో నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ప్రత్యేకంగా 4 పుష్పక్ బస్సులు(Pushpak Buses) నడుస్తున్నాయని డీఎం వెంకటేశం(DM Venkatesham) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సర్వీసులు కొత్తగూడ, గచ్చిబౌలి, కొండాపూర్, హఫీజ్పేట, లింగంపల్లి మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకుంటాయని తెలిపారు. ఉదయం 5:45 నిమిషాలకు తొలి బస్సు చివరి బస్సు రాత్రి 8:45 గంటలకు చివరి సర్వీస్ ఉంటుందన్నారు. మియాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ కు ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సును ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చినట్లు డీ ఏం వివరించారు.