18-06-2025 12:25:48 AM
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచే వరకు విశ్రమించబోమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ఉద్యమాలను గ్రామస్థాయి వరకు విస్తరింపజేయడానికి బీసీలు సిద్ధంగా ఉం డాలని పిలుపునిచ్చారు.
మంగళవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను పెంచడానికి ప్రభుత్వానికి గల ఇబ్బందులు ఏమిటి? వాటిని అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దీనికి అన్ని పార్టీల మద్దతు ఎలా కూడగట్టాలి? అనే అంశ అంశాలపై ప్రభుత్వ ఏనాడైనా ఆలోచించిందా? ఆ దిశగా చర్యలు తీసుకుందా అని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి పెంచాలని చిత్తశుద్ది ఉంటే అన్ని వర్గాల, అన్ని పార్టీల మద్దతు కూడా గట్టి దిశగా ప్రయత్నాలు జరపాలన్నారు. ప్రభుత్వానికి కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం, అమలు చేయాలని చిత్త శుద్ది ఉంటే అన్ని పార్టీలతో, బిసీ సంఘాల నాయకులతో చర్చించి అందరిని కూడగట్టి అమలు చేయాలని కోరారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు.
ఈ సమావేశంలో నాయకులు జి అనంతయ్య, జిల్లపల్లి అంజి, వేముల రామకృష్ణ, మధుసూదన్, పగిళ్ల సతీష్, మోడీ రామ్దేవ్, నిఖిల్ పాటిల్, కె శివకుమార్, సి మణికంఠ, కె లింగం ముదిరాజ్, రవి యాదవ్, మురళి, కౌశిక్, బాలయ్య, సుప్రజ పాల్గొన్నారు.