11 April, 2026 | 3:53 PM

Breaking News

బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే   •   ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •  

తిరుమలలో హుస్నాబాద్ వాసుల భజనలు

03-07-2025 01:40 AM

హుస్నాబాద్, జులై 2 : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఇచ్చిన పిలుపు మేరకు, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన పద్మావతి భజన మండలి సభ్యులు తిరుమలలో భక్తిశ్రద్ధలతో భజనలు, కీర్తనలు నిర్వహించారు. బుధవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, అలాగే రాత్రి 8 నుంచి 10 గంటల వరకు తిరుమలలోని అఖండ హరినామ స్మరణ మందిరంలో పద్మావతి భజన మండలి సభ్యులు స్వామివారి నామస్మరణతో మార్మోగిం చారు.

ఈ భజన కార్యక్రమం స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులను అలరించింది. పద్మావతి భజన మండలి సభ్యులైన కాపర్తి జయ, వెల్ది శ్యామల, కొత్తపల్లి చంద్రకళ, మాశెట్టి రాణి, గడ్డం లక్ష్మి, పూదరి లక్ష్మి, వల్లబోజు పద్మ, రోడ్డ విజయ, చిదురాల నాగరాణి, తాడ మాధవి, సావుల శోభ భజనలు, కీర్తనలు ఆలపించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచింది.