calender_icon.png 14 June, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవిత కేంద్రం పనులు 15లోగా పూర్తి చేయాలి

11-06-2025 12:00:00 AM

మిర్యాలగూడ, జూన్ 10 : భవిత కేంద్రం మరమత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని  మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ మాలెంపాటి ఆదేశించారు. మంగళవారం మిర్యాలగూడ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయ ప్రాంగణంలో గల భవిత కేంద్రాన్ని ఆయన సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించారు.

4 లక్షల 30 వేల రూపాయల నిధులతో భవిత కేంద్రంలో టాయిలెట్స్ ఫ్లోరింగ్,  ప్రహరీ గోడ నిర్మాణం, డోర్లు, కిటికీలు, భవిత కేంద్రం పూర్తిగా కరెంటు పని, కలరింగ్, తదితర పనులు చురుకుగా సాగుతున్నాయి. ఆ పనులను సబ్ కలెక్టర్  పరిశీలించి ఈనెల 15లోగా పూర్తి చేయాలని కోరారు. భవిత కేంద్రం ప్రహరీ గోడ లోపు పూర్తిగా ఎర్రమటితో చదును చేయాలన్నారు.  మండల విద్యాధికారి బాలు నాయక్, ఎంపీడీవో శేషగిరి శర్మ, ఏఈ జగన్ తదితరున్నారు.