11-06-2025 12:00:00 AM
మిర్యాలగూడ, జూన్ 10 : భవిత కేంద్రం మరమత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ మాలెంపాటి ఆదేశించారు. మంగళవారం మిర్యాలగూడ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయ ప్రాంగణంలో గల భవిత కేంద్రాన్ని ఆయన సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించారు.
4 లక్షల 30 వేల రూపాయల నిధులతో భవిత కేంద్రంలో టాయిలెట్స్ ఫ్లోరింగ్, ప్రహరీ గోడ నిర్మాణం, డోర్లు, కిటికీలు, భవిత కేంద్రం పూర్తిగా కరెంటు పని, కలరింగ్, తదితర పనులు చురుకుగా సాగుతున్నాయి. ఆ పనులను సబ్ కలెక్టర్ పరిశీలించి ఈనెల 15లోగా పూర్తి చేయాలని కోరారు. భవిత కేంద్రం ప్రహరీ గోడ లోపు పూర్తిగా ఎర్రమటితో చదును చేయాలన్నారు. మండల విద్యాధికారి బాలు నాయక్, ఎంపీడీవో శేషగిరి శర్మ, ఏఈ జగన్ తదితరున్నారు.