calender_icon.png 14 June, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగులో రైతులకు అండగా ఉంటాం

11-06-2025 12:00:00 AM

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల, జూన్ 10 (విజయక్రాంతి): జిల్లాలో వ్యవసాయ పంటల సాగులో రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని మంచిర్యాల శాసనసభ్యులు కోకిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్లో కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతిలతో కలిసి మండల వ్యవసాయ అధికారులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు, బ్యాంక్ అధికారులు,

ఫర్టిలైజర్ షాపుల యజమానులు, రైతులతో నిర్వహించిన వానాకాలం వ్యవసాయ సాగు సంసిద్ధత సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ తో కలిసి మాట్లాడారు. జిల్లాలో పంట సాగులో రైతులకు అవసరమైన సాగునీరు, పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు ఇతర అన్ని విధాలుగా చేయూత అందిస్తామని అన్నారు. సాగులో రైతులకు అవసరమైన మెళకువలు అందించడంతో పాటు సాగునీరు, పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు ఇతర అన్ని సదుపాయాలు సమకూర్చి చేయూత అందించడం జరుగుతుందని తెలిపారు.

పౌల్ట్రీ, డైరీ ఫారాలు, చేపల పెంపకం, పట్టు పరిశ్రమ, పెరటి కోళ్ళ పెంపకం ఇతర అంశాలపై అర్హులైన పాడి రైతులకు ప్రభుత్వ పథకాల క్రింద అవకాశం ఉన్న రాయితీ రుణాలు అందించి ప్రోత్సహిస్తామని తెలిపారు. పంట రుణాలు, వ్యవసా య రుణాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రుణాలను అర్హులైన లబ్దిదారులకు అందిం చి రైతులను అభివృద్ధి దిశగా ప్రోత్సహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని రైతు లు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 

రైతులు మొదటి పంటలో దొడ్డు రకం, సన్న రకం వరి ధాన్యాన్ని సాగు చేసుకోవచ్చని, రెండవ పంట సమయంలో పంట మార్పిడి విధానాన్ని అవలంభించి వాణిజ్య, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం ద్వారా అధిక దిగుబడి రావడంతో పాటు భూసారం పెంపొందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్, అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రతినిధి సింగతి మురళి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.