07-06-2025 12:45:32 AM
నల్లగొండ టౌన్, జూన్ 6: నల్గొండ పట్టణం శివాజీ నగర్ ప్రాంతానికి చెందిన మారోజు కౌసల్య (86) శుక్రవారం మరణించగా వీరి కుమారులు భీష్మ కుమార్, విశ్వవిజయ్ కుమార్ బంధుమిత్రులు సదానంద్, ప్రవీణ్, బుచ్చి రామాచారి లను సంప్రదించగా వీరి మరణానంతర నేత్రదానానికి అంగీకరించడంతో నేత్రదాన సేకరణ చేశారు.
అదేవిధంగా పద్మావతి కాలనీ ప్రాంతానికి చెందిన కొప్పరపు వెంకట రాయ శర్మ (82) స్వర్గస్తులు కాగా వీరి కుమారుడు కొప్పరపు బుచ్చిరామయ్య, కోడలు అంజనీదేవి లను సంప్రదించి మరణానంతర నేత్రదాన ప్రాముఖ్యతను వివరించగా వీరి అంగీకారంతో నేత్రదాన సేకరణ జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ టెక్నీషియన్ బచ్చలకూర జానీ, మేనేజర్ డాక్టర్ పుల్లారావు నేత్రదాన సేకరణ చేశారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ - ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులలో ఒకరు మన నుంచి దూరం అవటం ఎంతో బాధ కలిగించే విషయమని, కుటుంబమంతా తీవ్రమైన దుఃఖంలో ఉండి, ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్న సమయంలో కూడా నేత్రదానం చేయుట ఎంతో గొప్ప విషయమన్నారు.
నేత్రదానం చేసేందుకు 9948143299 సంప్రదించాలని కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల కోరారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ - అడ్వకేట్ కేవీ ప్రసాద్, మేనేజర్ డాక్టర్ పుల్లారావు, లయన్ ఎల్ వి కుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు తెలిపారు.
ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ - డాక్టర్ హరనాథ్, మేనేజర్ - డాక్టర్ పుల్లారావు, సభ్యులు డాక్టర్ - ప్రనూష, డాక్టర్ - నితిషా, ఏచూరి శైలజ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షలు - డాక్టర్ దామొర యాదయ్య, కార్యదర్శి - డాక్టర్ కొనకంచి విజయకుమార్, కోశాధికారి - డాక్టర్ ఎం. ప్రవీణ్, లయన్ వేముల సాయికుమార్, నిమ్మల పిచ్చయ్య, గట్టు అశోక్ రెడ్డి, తంతెనపల్లి సైదులు వీరి మృతి పట్ల సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.