పదిలో బృంగీ అద్భుత ఫలితాలు

01-05-2024 01:52:33 AM

వికారాబాద్, ఏప్రిల్ 30( విజయక్రాంతి): ఏటా బృంగీ ఇంటర్‌నేషన్ స్కూల్ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని పాఠశాల చైర్మన్, మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం విడుదలైన పది ఫలితాల్లో బృంగీ పాఠశాలలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో నాణ్యమై విద్యను అందించాలనే ఉద్దేశంతో బృంగీ పాఠశాలను నెలకొల్పినట్లు తెలిపారు. పది ఫలితాల్లో తమ విద్యార్థులు 95 శాతం ఉతీర్ణత సాదించినట్లు వెల్లడించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించడం గర్వంగా ఉందన్నారు. 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు ఇంటర్‌లో ఉచిత విద్యను అందిస్తున్నామన్నారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి సీబీఎస్‌ఈ విద్యావిధానం ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కుమారస్వామి, ప్రిన్సిపాల్ రమాదేవి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.