calender_icon.png 17 June, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూసమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టం

16-06-2025 07:48:38 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): భూసమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి రెవెన్యూ సదస్సుల(Bhu Bharathi Revenue Conferences) ద్వారా భూసమస్యలపై పరిష్కారం జరుగుతుందని మందమర్రి తహసీల్దార్ సతీష్(Tahsildar Satish) అన్నారు. సోమవారం క్యాతన్ పల్లి పురపాలకం 5వ వార్డు అమరవాదిలో తహసీల్దార్ సతీష్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రెవెన్యూ సదస్సులో భూసమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని అలాగే భూసమస్యలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు.