calender_icon.png 5 June, 2025 | 7:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధార్ లాగే భూములకు భూధార్ తీసుకువస్తాం: మంత్రి పొంగులేటి

03-06-2025 01:43:47 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రజల వద్దకే రెవెన్యూ నినాదంతో భూ సమస్యల(Land Issues)పై నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో కొత్త రెవెన్యూ చట్టం(New Revenue Act)పై రైతులకు అవగాహన కోసం సదస్సులు కొనసాగుతున్నాయి. తాజా ములుగు జిల్లా(Mulugu District) ములుగుమూడు గ్రామం(Mulugumadu Village)లో నిర్వహించిన భూభారతి సదస్సుకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... రైతులకు(Farmers) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భూభారతి చట్టం(Bhubharathi Act) తెచ్చామని, మనుషులకు ఆధార్ లాగే భూములకు త్వరలో భూధార్ తీసుకువస్తామని పేర్కొన్నారు. 

కంప్యూటర్ లో భూధార్ నంబర్ కొట్టగానే అన్ని వివరాలు వస్తాయని, భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా సర్వే ల్యాండ్ రికార్డు సహాయకులుగా లైసెన్స్​డ్ సర్వేయర్లను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. గ్రామాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి 3500 మంది రెవెన్యూ అధికారులను నియమిస్తున్నామని, అధికారులు గ్రామాల్లోనే రైతుల సమస్యలను పరిష్కారిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. భూమి సమస్యలకు పరిష్కారాలు అభించక పదేళ్లపాటు రైతులు ఇబ్బంది పడ్డారని, విప్లవాత్మకమైన, వినూత్నమైన చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని మంత్రి తెలిపారు.