బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) మణుగూరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు(Telangana State Formation Day Celebrations) ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో బి ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు జాతీయ జెండా నావిస్కరించి వేడుకలను నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పోరాట ఫలితంగానే తెలంగాణ సిద్ధించిందని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సర్వతో ముఖా అభివృద్ధి చెందిందాన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి తిరోగమనలో ప్రయాణిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్, సొసైటీ అధ్యక్షులు కురి నాగేశ్వరరావు, పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు






