03-06-2025 01:53:01 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): విప్లవాత్మకమైన, వినూత్నమైన చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) తీసుకువచ్చిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswara Rao) పేర్కొన్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా.. భూమి సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. రైతుల(Farmers) సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే చట్టాన్ని ఈ సర్కారు తెచ్చిందని వివరించారు. భూములు విలువలు పెరిగిపోవడం వల్ల చెరువులు, కాలువలు కబ్జా చేస్తున్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ ఎన్నికల అజెండాలోనే పెట్టిందని, అత్యాధునిక టెక్నాలజీతో అన్ని గ్రామాల్లో సమగ్ర సర్వేను ప్రభుత్వం చేపడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు.
సాధారణంగా భూములు జోలికి వెళ్లేందుకు పాలకులు భయపడతారని, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ధైర్యంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయంలో మార్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. కొన్నేళ్లుగా రెవెన్యూ వ్యవస్థలో అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నాయని మంత్రి తుమ్మల సూచించారు.