calender_icon.png 15 June, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూసమస్యల పరిష్కారానికే భూభారతి

11-06-2025 12:00:00 AM

- కలెక్టర్ కుమార్ దీపక్

- క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారుల చర్యలు తీసుకోవాలి

- వేంపల్లిలో దరఖాస్తుల ప్రక్రియ పరిశీలన

హాజీపూర్ (మంచిర్యాల), జూన్ 10 (విజయక్రాంతి) : రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూ భారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టం తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నా రు. మంగళవారం హాజీపూర్ మండలం వేం పల్లి వార్డు కార్యాలయంలో మండల తహసీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే, పెద్దంపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉప తహసీల్దార్ సతీష్‌కుమార్‌లతో కలిసి రెవె న్యూ సదస్సును సందర్శించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంలో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూసమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించ డం జరుగుతుందని తెలిపారు. ఈ దరఖాస్తులను రికార్డులతో సరి చూసి, క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే దిశగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తుతో పాటు రిజిస్టర్డ్ దస్తావేజులు, రెవెన్యూ రికార్డులు జతపరిచినట్లయితే త్వరగా పరిష్కరించేందు కు అవకాశం ఉంటుందన్నారు. 

పాఠశాలను సిద్ధం చేయాలి..

ఈ నెల 12 నుంచి 2025 విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యం లో జిల్లాలోని పాఠశాలను పూర్తి స్థాయిలో సిద్దం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. దొనబండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల తరగతి గదులు, వంటశాల, పరిసరాలను పరిశీలించారు. తరగతి గదులు, పరిసరాల ను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీటిని అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల ప్రారంభం రోజునే విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేసేందుకు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. 

ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సౌకర్యార్థం సకల సదు పాయాలు కల్పించడం జరిగిందని, పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ను  పెంచాలన్నారు. బడిబాట కార్యక్రమం లో భాగంగా బడి బయట, మధ్యలో బడి మానివేసిన పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్పించాలని, బడి వయస్సు గల ప్రతి ఒక్క రు పాఠశాలలో ఉండే విధంగా ఉపాధ్యాయులు తమ పరిధిలో తగు చర్యలు తీసుకు నేలా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలన్నా రు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.