19-06-2025 12:00:00 AM
హనుమకొండ, జూన్ 18 (విజయ క్రాంతి): భూ భారతి రెవెన్యూ సదస్సులొ భాగంగా హాసన్ పర్తి గ్రామ శివారు రైతు వేదికలో ఏర్పాటు చేసిన సదస్సులో రైతులు పాల్గొని తమ భూములకు సంబంధించిన పట్టా పాస్ బుక్ ల కోసం దరఖాస్తులను హన్మకొండ ఆర్డిఓ రమేష్ రాథోడ్, తహసిల్దార్ చల్లా ప్రసాద్ లకు అందించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహసిల్దార్ ఎండి రహీం, మండల రెవెన్యూ అధికారులు ఫజిలి, కుమారస్వామి,రాజేంద్రప్రసాద్, 66 డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కనపర్తి కిరణ్, మాజీ వరంగల్ మార్కెట్ డైరెక్టర్ వీసం సురేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఎల్ఐసి వెంకన్న, దేవస్థాన మాజీ చైర్మన్ బస్కురి శ్రీనివాస్, ఆరెల్లి వెంకటస్వామి, జన్ను రవీందర్, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్ల కిరణ్, మాజీ డైరెక్టర్లు వేల్పుల సదానందం, యూత్ అధ్యక్షులు తాళ్ల మధు, కొండమిది సంతోష్, మాజీ సర్పంచి చిర్ర తిరుపతి, రైతులు నన్నంశెట్టి స్వామి, మారేపల్లి రామచంద్రారెడ్డి, పర్ష సతీష్, తదితర రైతులు పాల్గొన్నారు.