19-06-2025 12:00:00 AM
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
శేరిలింగంపల్లి, జూన్ 18:చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యువకుడి దారుణ హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. యస్ఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా సిరిగిరి పేట్ కు చెందిన మాసన్పల్లి రామచందర్, పసుపు అమరేష్ లు వారం రోజుల క్రితం నగరానికి వలస వచ్చారు. రామచందర్ కూలీ పనులకు వెళ్తుండగా అమరేష్ ర్యాపిడో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
కాగా వీరు రోజంతా పనిచేసుకొని లింగంపల్లి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఫుట్ పాత్ పై నిద్రిస్తున్నారు. మంగళవారం కూడా యదావిధిగా పనిచేసుకొని రాత్రి 8 గం లకు లింగంపల్లి అండర్ పాస్ బ్రిడ్జి వద్ద ఉన్న కల్లు కంపౌడ్ లో కళ్ళు తాగడానికి వెళ్లారు. ఈ క్రమంలో కల్లు సేవిస్తుండగా ఒక మహిళ వచ్చి మా ఆడమనిషిని బండి మీద ఎక్కించుకు వెళ్తవా అని అమరేష్ ను గల్లపట్టి కొడుతూ దూర్బాషలాడింది.
దీంతో పాటు వీడియో కాల్ లో ఫోన్ చేసి మరో ఇద్దరిని అక్కడికి రప్పించింది. దీంతో అక్కడికి చేరుకున్న మరో ఇద్దరు వ్యక్తులు కూడా అమరేష్ ను విచక్షణారహితంగా కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. కాగా అమరేష్ మృతికి ఓ మహిళనే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది..కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుప్రారంభించారు.