19-06-2025 12:00:00 AM
కరీంనగర్, జూన్ 18(విజయ క్రాంతి): గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నెలాఖరులోపు ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని మొదటగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు మంత్రి పొం గులేటి మాటకద్వారా తెలుస్తుంది.
రాష్ట్ర ఎ న్నికల సంఘం నిర్దేశానుసారం ప్రభుత్వ యంత్రాంగం మండల, జిల్లా పరిషత్లతో పా టు గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబందించిన ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రామాలు, వార్డులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేసింది. పంచాయతీ ఎన్నికలకైతే బ్యాలెట్ పేపర్ల ముద్ర ణను సైతం పూర్తి చేశారు.
ఉమ్మడి జిల్లా పరిధిలోని..
మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని అన్ని జడ్పీలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్ర చారం చేయాలని నిర్ణయించుకుంది. రుణమాఫీ, తాజాగా ప్రకటించిన రైతు భరోసా, రాజీవ్ యువికాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత వంటగ్యాస్, 200 యూనిట్ల కు ఉచిత కరెంట్ లాంటి ప థకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలో నాలుగు జిల్లాలో ఉన్నాయి. ఈ నాలుగు జి ల్లాల్లో రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దు ద్దిళ్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ పార్లమెంట్ ప రిధిలోని సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పొన్నం ప్రభాకర్, జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అడ్లూ రి లక్ష్మణ్ కుమార్ తోపాటు, సి రిసిల్ల జిల్లా వేములవాడ నుంచి విప్గా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ ది శ్రీనివాస్ కు ఈ స్థానిక పోరు అగ్నిపరీక్ష కానుంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక పోరు ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో తే దీలు ఖరారు కానున్నాయి. కరీంనగర్ జిల్లా లో 15 జడ్పీటీసీ, 15 ఎంపీపీ, 170 ఎంపీటీ సీ స్థానాలు ఉండగా, పెద్దపల్లి జిల్లాలో 13 జడ్పీటీసీ, 13 ఎంపీపీ, 138 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 జడ్పీటీసీ, 12 ఎంపీపీ, 123 ఎంపీటీసీ స్థా నాలు ఉన్నాయి.
జగిత్యాల జిల్లాలో 20 జ డ్పీటీసీ, 20 ఎంపీపీ స్థానాలు ఉండగా ఎం పీటీసీ స్థానాలు 216 ఉన్నాయి. జడ్పీలను, ఎంపీలను కైవసం చేసుకోవాలంటే సగానికిపైగా స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవ సం చేసుకోవాల్సి ఉంటుంది. గత స్థానిక సంస్థలలో అప్పుడు అధికారంలో ఉన్న గు లాబీ పార్టీ బీఆర్ఎస్ మొత్తం జడ్పీలపై జెం డా ఎగురవేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.
బీఆర్ఎస్ పూర్వ వైభ వం కోసం ప్రయత్నించే అవకాశాలుండగా, క్రమక్రమంగా బలపడుతున్న బీజేపీ సైతం స్థానిక సంస్థలపై జెండా ఎగురవేయాలని చూస్తుండడంతో గతంలో ఎన్నడూ లేని వి ధంగా స్థానిక పోరుకు చాలా స్థానాల్లో త్రి ముఖ పోటీ ఉండే అవకాశం ఉంది.
అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డి కాంగ్రెస్ జెండా ఎగురవేసి పూర్వ వైభవం తీసుకురావాలనే వ్యూ హంతో ముందుకు పోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు మంత్రులకు కీలక బాధ్య తలు అప్పగించనున్నారు. అనంతరం సర్పం చ్ ఎన్నికలు జరిగేఅవకాశంఉంది.