calender_icon.png 8 June, 2025 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి మీ నమ్మకం రెట్టింపు చేస్తోంది

05-06-2025 12:42:18 AM

- ధరణి బీఆర్‌ఎస్ నేతలకు ఆదాయ వనరు

- భూభారతి రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

భూత్పూర్, జూన్ 4 : ప్రజల నమ్మకం రెట్టింపు చేసేలా భూభారతి పనిచేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు.  బుధవారం మండల పరిధిలోని కరివేన గ్రామంలో నిర్వహించిన భూ భారతి గ్రామ రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే  హాజరై మాట్లాడారు.  రైతుల భూ కష్టాలను తీర్చేందుకే  కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం - 2025 తీసుకొచ్చిందన్నారు. గత బిఆర్‌ఎస్ పాలనలో ధరణి చట్టంతో రైతులకు దరిద్రం పట్టుకుందని, భూ భారతి చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దో హదపడుతుందని భరోసానిచ్చారు.

చట్టాలు చేస్తే ప్రజల మేలు కోసం ఉండాలి గాని ప్రజలపై పెత్తనం చేసేలా ఉండకూడదని ధరణి ఉద్దేశించి విమర్శించారు. ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో కలిపి ఆస్థానం లో కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పి భూభారతి చట్టం అమలు చేశారన్నారు. గతంలో రైతులు ధరణి పోస్టల్ ద్వారా చాలా ఇబ్బందులు అనుభవించారని,  కార్యాలయాల చు ట్టూ చెప్పులు  అరిగేలా తిరిగారని, అధికారులు కూడా నిస్సహాలుగా ఉండి పోయారన్నారు.

ఈ దుస్థితిని మారుస్తూ పేద రైతుల కన్నీళ్లను తుడిచే ఉద్దేశంతో డాక్ట ర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజు భూ భా రతి చట్టాన్ని ప్రారంభించామన్నారు. గతం లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ రై తులకు న్యాయం చేస్తున్నామని పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న సాదా బైనమా పరిష్కారం కోసం భూభారతి చట్టంలో ప్రభు త్వం అవకాశం కల్పించిందన్నారు.

నూతన చట్టం ప్రకారం భూ సమస్యలు పరిష్కరిస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే భూభారతి చట్టం ప్రకా రం అప్పిలు చేసుకునే అవకాశం కూడా ఉం దని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కిషన్ నాయక్,   మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మా జీ ఎంపీపీ డాక్టర్ కదిరి శేఖర్ రెడ్డి,  మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్. భూపతిరెడ్డి, సీనియర్ పార్టీ నాయకులు హర్యానాయక్, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, కప్పెట వడ్డే శ్రీను తదితరులు పాల్గొన్నారు.

రేపు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాక: ఏర్పాట్లను పరిశీలించిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి 

ముసాపేట జూన్ 4  : మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గానికి శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విచ్చేస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మె ల్యే జి మధుసూదన్ రెడ్డి తెలియజేశారు. శుక్రవారం మూసపిట్ట మండలంలో డిప్యూ టీ సీఎం రాకకు సంబంధించి ఏర్పాట్లను ప్రత్యేకంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈ నెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు మూసాపేట్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44 సమీపంలో 13 కొత్త విద్యుత్ సబ్ స్టేషన్లు, 132/33 KV సబ్స్టేషన్ కు నిర్వహిస్తున్న భూమి పూజ కార్యక్రమంలో, పబ్లిక్ మీటింగ్ లో  ఉపముఖ్యమంత్రి వర్యు లు మల్లు భట్టి విక్రమార్క హాజరవుతున్న తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అధిక సం ఖ్యలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో మూసాపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శెట్టి శేఖర్, జానంపేట మాజీ ఎంపీటీసీ కృష్ణయ్య, తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ సురేష్, వేముల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాట సుధాకర్, మదనపురం మా ర్కెట్ కమిటీ డైరెక్టర్ నిరంజన్, మూసాపేట మండల యూత్ అధ్యక్షులు బోయ రవికుమార్, ముసాపేట మండలం తాసిల్దార్ రాజు, నాయక్ సీనియర్ అసిస్టెంట్ మధు గౌడ్,  ఆర్‌ఐ  అరుణ్, తదితరులు పాల్గొన్నారు.