05-06-2025 12:45:06 AM
సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య
తుర్కయంజాల్, జూన్ 4: ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై, ఆదివాసి గిరిజన ప్రజలపై సాగిస్తున్న హత్యాకాండను వెంటనే నిలిపివేయాలని, మావోయి స్టులతో శాంతి చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సభ్యులు పగడాల యాద య్య అన్నారు. రాగన్నగూడలోని సీఐటీయూ కార్యాలయం లో సిపిఎం తుర్కయంజాల్ మున్సిపల్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య మా ట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచి దేశంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించ కుండా సమస్యలతో సతమతమయ్యే ప్రజలు అసంతృప్తితో చేసే ఉద్యమాలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందని అందులో భాగంగానే ఆపరేషన్ కగారు పేరుతో మా వోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో హతమారుస్తుం దని అన్నారు.
వెంటనే ఈ దుశ్చర్యను ఆపి ప్రజాస్వామ్య పద్ధతుల్లో మావోయిస్టులు, ఆదివాసి గిరిజన ప్రజలతో శాంతి చర్చలు జరపాలని, వారు లేవనెత్తిన అంశాలను పరిష్కరించాలని అన్నారు. సమస్యలు ఉన్నంతకాలం ప్రభుత్వాలకు ఉద్య మకారులు ప్రజల నుండి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో భూభారతి పేరుతో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో భూ సమస్యలను అన్నింటిని పరిష్కరించాలని అన్నారు.
అనేక మంది ప్రజల అసైన్డ్ ప్రభుత్వ భూములను ఇప్పటికీ ధరణిలో ఎక్కించక పోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నా రు అలాంటి వారిని గుర్తించి వెంటనే ఆన్లైన్లో ఎక్కించే వారికి పాస్ పుస్తకాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు.
అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో భూ కబ్జాదారులు ప్రభుత్వ భూములను యథేచ్చగా కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని అలాంటి వాటిని గుర్తించి ప్రభుత్వ భూములను కాపాడాలని అన్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఎం, ఇతర ప్రజా సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం తుర్కయంజాల్ మున్సిపల్ కార్యదర్శి డి.కిషన్, కమిటీ సభ్యులు ఎం.సత్యనారాయణ, కె.అరుణ్ కుమార్, కె.శ్రీ రామ్ మూర్తి, కె.శారద, బి. శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.