calender_icon.png 8 June, 2025 | 12:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వాలి

05-06-2025 12:41:57 AM

ఇబ్రహీంపట్నం, జూన్ 04: రైతులకు పట్టాధార్ పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఖానాపూర్ గ్రామ రైతులు ప్రభుత్వాన్ని కోరారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఖానాపూర్ గ్రామం 10వ వార్డులో బుధవారం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునితారెడ్డి కి, సి పిఎం పార్టీ ఆధ్వర్యంలో మెమోరాండం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖానాపురం గ్రామంలోని సర్వే నెం. 79, 43 ప్రభుత్వ భూములకు అసైన్మెంట్ పట్టా సర్టిఫికెట్లు, భూమి ఇచ్చిన రైతులకు పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని అన్నారు.

పూర్వం క్రితం అసైన్మెం ట్ పట్టాలు, గత ప్రభుత్వం పేదలకు ఇవ్వడం జరిగిందని, ధరణి వచ్చిన తర్వాత పట్టాదారు పా సుబుక్కులు ఇవ్వడం నిలిపివేయడం జరిగిందని గుర్తుచేశారు. కావున అసైన్మెంట్ పట్టా పొందిన ప్రతి పేదవారికి పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోడ సామేలు, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యదర్శి చింతపట్ల ఎల్లేశ, ఖానాపూర్ గ్రామ రైతులు యాదయ్య, శంకర్ తదితరులుపాల్గొన్నారు