10-06-2025 04:41:11 PM
గత ప్రభుత్వం పదేండ్లలో చేయలేనివి ఎన్నో ఏడాదిన్నరలో చేశాం..
బీఆర్ఎస్ ది కుటుంబ పాలన కాంగ్రెస్ ది ప్రజా పాలన..
భువనగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా..
ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి..
వలిగొండ (విజయక్రాంతి): ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు అందజేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbam Anil Kumar Reddy) అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్లో ఇందిరమ్మ ఇండ్ల అర్హులైన వారికి మంజూరి పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... గత ప్రభుత్వం పదేండ్లలో చేయలేనివి ఎన్నో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏడాదిన్నరలో చేశామని అన్నారు. బీఆర్ఎస్ ది కుటుంబ పాలనని కాంగ్రెస్ ది ప్రజా పాలనని ఇందిరమ్మ లబ్ధిదారుల ఎన్నికల్లో ఎంపికలో పార్టీలకతీతంగా అర్హులైన పేదలకు ఇల్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండ,ర్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుండి 10 లక్షల పెంపు, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సన్న బియ్యం పథకం వంటివి ప్రజలకు అందించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా అర్హులైన వారందరికీ నూతనంగా తెల్ల రేషన్ కార్డులను, రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం వంటివి కూడా చేపట్టడం జరిగిందని అన్నారు.
భువనగిరి నియోజకవర్గంలోని సాగునీటి కాలువలను అభివృద్ధి చేసేందుకు 500 కోట్లను మంజూరు చేయించడం జరిగిందని అదేవిధంగా 200 కోట్లతో ఇంటర్నేషనల్ స్థాయి కలిగిన ఇంటిగ్రేట్ స్కూలు మంజూరు కావడం జరిగిందని, వలిగొండ నుండి కాటేపల్లికి అద్భుతమైన రోడ్డును వేయడం జరుగుతుందని అదేవిధంగా భీమ లింగం కాల్వకు 10 కోట్లు తీసుకువచ్చి రీ మోడలింగ్ చేయిస్తానని అన్నారు. కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగవని ప్రజా సంక్షేమం కోసం కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, అధికారులు, వివిధ చైర్మన్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.